ముంబై మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబై ఆటగాళ్లతో పాటు తన భార్య రితిక సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. మరోవైపు రోహిత్ శర్మకు తోటి ప్లేయర్లు, అభిమానులు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి భారత్కు టీ20 వరల్డ్ కప్ అందివ్వాలని పోస్టులు పెడుతున్నారు. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30 న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించాడు.రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి 23,000 పరుగులు చేశాడు
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. అంతర్జాతీయ T20ల్లో అత్యధిక సెంచరీలు (5), వరల్డ్ కప్ ల్లో అత్యధిక శతకాలు (8), ఒకే వరల్డ్ కప్ లో 5 సెంచరీలు, అత్యధిక సిక్సర్లు (597), వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3), ఒకే ఏడాదిలో అత్యధిక రన్స్ (2442), వన్డేల్లో అత్యధిక స్కోరు (264), ఒక వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు (33), ఐపీఎల్ లో 5 ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్.
2023 వన్డే ప్రపంచకప్లో రోహిత్ 597 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రానున్న టీ20 వరల్డ్ కప్ తన లక్ష్యమని, మరో వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఉందని తాజాగా రోహిత్ తన మనసులో మాట బయటపెట్టాడు. రోహిత్ తన ఫామ్ కొనసాగించాలని, ఇండియాకి వరల్డ్ కప్లు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.