TEST: శతక్కొట్టిన గిల్, జైస్వాల్.. తొలి రోజు భారత్దే
సూపర్ సెంచరీలతో అదరగొట్టిన గిల్, జైస్వాల్... పంత్ పవర్ ఫుల్ ఇన్నింగ్స్;
యంగ్ టీం అన్నారు. ఏం చేస్తుంది అన్నారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇండియన్ క్రికెట్లో సంక్షోభమే అన్నారు. కొందరు సీనియర్లు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కెప్టెన్సీపై ఎలాంటి అంచనాలు లేవని కామెంట్ చేశారు. ఐపీఎల్కు తప్ప వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు పనికిరారు అన్నారు. ఇలాంటివే మరెన్నో కామెంట్స్. కానీ.. ఒకే ఒక్క రోజు ఆటతో యంగ్ టీమిండియా అందరి నోర్లు మూయించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో యంగ్ ఇండియా అదరగొట్టింది. ఇంగ్లండ్ వరల్డ్ క్లాస్ బౌలర్లకు యంగ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. మొదట టాస్ గెలిచినా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కి దిగిన భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(42; 78 బంతుల్లో 8 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 1 సిక్సర్, 16 ఫోర్లు) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రాహుల్ తర్వాత నిలకడగా బౌండరీలు బాదాడు. స్టోక్స్ వేసిన 20 ఓవర్లో చక్కటి కవర్ డ్రైవ్లతో వరుసగా రెండు ఫోర్లు రాబట్టాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రాహుల్.. బ్రైడన్ కార్స్ వేసిన 24.5 ఓవర్కు ఫస్ట్ స్లిప్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ వేసిన 25.4 ఓవర్కు వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ సైతం తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 144 బంతుల్లో 111 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. 14 ఫోర్లు, ఒక సిక్స్తో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ కలిసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్కు పటిష్ట ఆరంభాన్ని అందించారు.
రికార్డ్ సాధించిన జైస్వాల్
క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ గిల్, జైస్వాల్తో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీరిద్దరూ ధనాధన్ ఫోర్లతో బౌలర్లను కంగారు పెట్టారు. ఈ జోడీ మూడో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం (157 బంతుల్లో) నెలకొల్పింది. ఈ క్రమంలోనే సెంచరీ చేసిన జైస్వాల్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన 52.3 ఓవర్ లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కాగా, ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. అంతకుముందు మురళీ విజయ్, విజయ్ మంజ్రేకర్, సౌరభ్ గంగూలీ ఈ ఘనత సాధించారు.
దంచికొట్టిన గిల్, పంత్
ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (127*; 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) వరుస బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ (65*; 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుతమైన షాట్లతో అలరించి అర్ధ శతకం పూర్తి చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, బ్రైడన్ కార్స్ ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కళ్లు చెదిరే బౌండరీతో ఔరా అనిపించాడు. తొలి టెస్ట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన పంత్.. ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీ తరలించాడు.