భారత్ - ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్ లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో, 64 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగారు. టాస్ ఓడిపోయిన తర్వాత, టీమిండియా ముందుగా బ్యాటింగ్కు దిగింది. రోజు ముగిసే సమయానికి 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 52 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి రెండవ రోజు ఆటపై ఉంది.
అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. స్థానిక సమయం ప్రకారం మ్యాచ్.. ఉదయం 11 గంటలకు (భారత్లో 3.30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 5 శాతం ఉంటుంది. భోజన సమయం వరకు వర్షం పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య వర్షం పడే అవకాశం 50 శాతం ఉంది. అలా అయితే, వరుణుడు రెండవ సెషన్లో ఆటకు అంతరాయం కలిగించవచ్చు.
ఇంగ్లాండ్ పర్యటనలో, కరుణ్ నాయర్ చివరకు ఓవల్ టెస్ట్ మ్యాచ్లో తన ఎంపిక సరైనదని నిరూపించుకోగలిగాడు. గ్రీన్-టాప్ వికెట్పై టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాట్స్మెన్ తడబడగా.. నాయర్ మొదటి రోజు ఆట ముగిసేలోపు తన అర్ధ సెంచరీని పూర్తి చేయగలిగాడు. ఇప్పుడు రెండవ రోజు వారి భుజాలపై పెద్ద బాధ్యత ఉంది.