మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ఆందోళన చేపట్టిన దేవరకద్ర ప్రజలు.. ఇప్పుడు ఫ్లైఓవర్పై రాకపోకలు సాగుతుండగా.. ఎందుకు డిమాండ్ చేశాం రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.. ఫ్లైఓవర్ నిర్మాణంతో ఇప్పుడు పట్టణం రెండు భాగాలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు తమకు ప్రత్యామ్నాయం చూపించండి అని జనం వేడుకుంటున్నారు.