ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లా ప్రజల కల నెరవేరబోతుంది. ఆధునాతన వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత దగ్గర కానున్నాయి. ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి కేంద్రంగా 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు హాస్పిటల్ కొత్త బిల్డింగ్, ఇతర సౌకర్యాల కోసం రూ.45.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలు వబడ్డాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం లో సకల సౌకర్యాలతో ఆసుపత్రిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో హామీ అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే హాస్పిటల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్వరలోనే పాలేరు నియోజకవర్గ ప్ర జలకు క్వాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సదుపా యాల కల్పన కోసం 100 పడకల హాస్పిటల్ తో మరింత మంది డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది రానున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్కాలేజీ కొత్త బిల్డింగ్, కూసమంచిలో కొత్త జూనియర్
కాలేజీ, ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోన ర్సింగ్ కాలేజీ, పొన్నెకల్ లో సమీకృత రెసి డెన్షియల్ స్కూల్ను కూడా మంజూరైంది. ఇందులో భాగంగా గట్టుసింగారం రెవెన్యూ విలేజ్ కేజీవీబీ స్కూల్ పక్కన సర్వే నెంబర్ 12 లో 5 ఎకరాల భూమిని కేటాయించి కలెక్టర్ కు అప్పగించారు. ప్రజల కోరిక నెరవేర్చుందుకు మంత్రి పొంగులేటి చేసిన ప్రయత్నం ఫలిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.