తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 34వేల 426 మందికి పరీక్షలు నిర్వహించగా...1417 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది..
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 34వేల 426 మందికి పరీక్షలు నిర్వహించగా...1417 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఒక్కరోజే కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 974వరకు పెరగింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 58వేల153 ఉండగా.. కరోనాను జయించిన వారి సంఖ్య లక్షా 27వేల 7 కేసులు అని పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం 30వేల 532 యాక్టివ్ కేసులు ఉన్నాయి.