తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 163వ్యాధుల చికిత్సలను చేర్చింది. ఇందులో మోకాలి ఆపరేషన్, ఫిస్టులా, రేడియాలజీ చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించిన 7 చికిత్సలు, క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్, వీనో ఆర్టీరియల్ ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజినేషన్, ఇండక్షన్ ఆఫ్ ఫెర్టిలిటీతో పాటు మరికొన్ని చికిత్సలను అదనంగా చేర్చింది. ప్యాకేజీల ధరలు పెంచింది.
రేట్ల సవరణపై అధ్యయనం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల లోని మెడికల్, సర్జికల్ విభాగాల నిపుణు లతో చర్చించి మొత్తం 1,672 ప్యాకేజీలలో 1,375 ప్యాకేజీ రేట్లను సవరించాలని నిర్ణయించింది. మిగి లిన ప్యాకేజీ ధరలు మారవని తెలిపింది.
2013 నుంచి 2024 వరకు ధరల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20–25 శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.