Nizamabad: మంటల్లో ఎనిమిది మూగజీవాలు సజీవదహనం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనేది మిస్టరీ..
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి శివారులో దారుణం చోటుచేసుకుంది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి శివారులో దారుణం చోటుచేసుకుంది. అత్యవసర సమయంలో పేషెంట్లను తరలించే అంబులెన్స్లో అర్ధరాత్రి గుట్టుగా ఆవులను తరలిస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్లో మంటలు చెలరేగటంతో డ్రైవర్ పరారయ్యాడు. మంటల్లో ఎనిమిది మూగజీవాలు సజీవ దహనమయ్యాయి. పేషెంట్లను తరలించే అంబులెన్స్లో మూగజీవాలను తరలిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్ దగ్ధంపై పోలీసులు విచారణ చేపట్టారు..