తెలంగాణ చలి తీవ్రత పెరిగింది. ఈ సీజన్లో తొలిసారి సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డిలోని కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్తోపాటు శివారులోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయింది. రాజేంద్రనగర్లో 12.4 డిగ్రీలు, బీహెచ్ఈఎల్లో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఇబ్రహీంపట్నం మంగలపల్లిలో రికార్డు స్థాయిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట, తెల్లవారుజామున జనం జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.