Pocharam convoy : స్పీకర్‌ పోచారం కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి...!

Pocharam convoy : తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు

Update: 2021-10-11 09:30 GMT

Pocharam convoy : తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం కళ్లకల్‌ వద్ద...నేషనల్‌ హైవే 44 పై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్తోంది. రోడ్డు దాటేందుకు అటుగా వచ్చిన ..50 ఏళ్ల నర్సింహారెడ్డిని..కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నర్సింహారెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. నర్సింహారెడ్డి...కొన్నేళ్లుగా వలస వచ్చి కళ్లకల్‌లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.

Tags:    

Similar News