చంచల్ గూడా జైల్లో ఉన్న అఘోరి , శ్రీవర్షిణి కోసం పరితపించి పోతోంది. శ్రీవర్షిణి చూడాలంటూ పట్టుబడుతోంది. ఆహారం తీసుకునేందుకు నిరాకరిస్తోందని సమాచారం.
పాలు మాత్రమే ఇవ్వండి, వేరేవి తినను అంటూ తెగేసి చెబుతోందని తెలుస్తోంది. రెస్క్యూ హోమ్ కి శ్రీ వర్షిణి వెళ్లిన విషయం అఘోరికి తెలియదు. దీంతో ఆమె కోసం పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తోంది. జైలు అధికారులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటోందని సమాచారం.