TG : రేషన్ కార్డులకు దరఖాస్తులు షురూ

Update: 2025-02-12 09:00 GMT

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో రద్దీ నెలకొంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ అధికారులను పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో మీ సేవ కేంద్రాలకు ఉదయం నుంచే దరఖాస్తుదారులు తరలివచ్చారు. సోమవారం రాత్రి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తు దారులు పెద్ద సంఖ్యలో రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్యూలైన్ ను ఏర్పాటు చేశారు. దరఖాస్తు స్వీకరణలకు సోమవారం రాత్రి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నా మని.. కాబట్టి వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక రేషన్ కార్డు దరఖాస్తుకు కేవలం రూ.50 మాత్రమే మీసేవా నిర్వహకులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఎక్కువ అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

Tags:    

Similar News