అవకాశమొస్తే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అవకాశవాదులని.. కాళేశ్వరంపై రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరదీసిందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు.. గాడిద గుడ్డే అని సెటైర్ వేశారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని.. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రాకపోవడం దుర్మార్గమన్నారు. భారత్ను నెంబర్ వన్గా తీర్చిదిద్దడం.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతున్నట్లు చెప్పారు.