అధికార టీఆర్ఎస్ చెప్పినట్టే ఈసీ నడుస్తోందిని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వరద సాయంపై తను ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదని.. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీఆర్ఎస్ కుట్రలకు తెరలేపిందన్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి తాను ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఫలనా ఆలయానికి రమ్మని చెబితే నేనే వచ్చావాడినని అన్నారు బండి సంజయ్.