TRS పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు : బండి సంజయ్

టీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణలోని ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్.

Update: 2021-04-01 08:15 GMT

టీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణలోని ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. ప్రజాసమస్యలపై ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సంజయ్. లంబాడాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే సాగర్‌ ఉపఎన్నికలో ఎస్టీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించామన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల తీర్పు బాధకలిగించిందని చెప్పారు బండి సంజయ్.

Tags:    

Similar News