జనసేన నుంచి ప్రతిపాదన వస్తే చర్చిస్తాం : బండి సంజయ్

Update: 2020-11-19 09:01 GMT

గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఎలాంటి ప్రతిపాదనలు పవన్‌ కల్యాణ్‌ నుంచి రాలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తమ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలున్నాయన్నారు. జనసేన పార్టీ నుంచి పొత్తులపై ప్రతిపాదన వస్తే చర్చిస్తామన్నారు. ఇక గ్రేటర్‌ లోని అన్ని డివిజన్లలో బీజేపీ బరిలో ఉందన్నారు. రెండు మూడు డివిజన్లలో ఉన్న పరిస్థితులపై మాత్రం పునః సమీక్షిస్తున్నామన్నారు.

Tags:    

Similar News