bhatti: ఏపీ మంత్రులకు భట్టీ కీలక సూచన

బనకచర్ల అప్పుడు కట్టుకోవచ్చని సూచన;

Update: 2025-08-02 10:45 GMT

తె­లం­గాణ ని­ర్మిం­చే ప్రా­జె­క్టుల ని­ర్మా­ణా­లు పూ­ర్త­యిన తర్వాత బన­క­చ­ర్ల కట్టు­కో­వ­చ్చ­ని డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క అన్నా­రు. ప్ర­జ­ల­ను తప్పు­దోవ పట్టిం­చే వ్యా­ఖ్య­లు ఏపీ మం­త్రు­లు మా­ట్లా­డ­కూ­డ­ద­ని సూ­చిం­చా­రు. ఏపీ మం­త్రి లో­కే­శ్‌ తప్పు­దోవ పట్టిం­చే వ్యా­ఖ్య­లు చే­య­కూ­డ­ద­న్న భట్టి.. 2 లక్షల ఎక­రా­లు ము­ని­గి­పో­కుం­డా పో­ల­వ­రం కట్టు­కో­వ­చ్చ­న్నా­రు. ముం­పు గ్రా­మాల ప్ర­జల తర­ఫున పో­రా­డేం­దు­కు తాము సి­ద్ధం­గా ఉన్నా­మ­ని అన్నా­రు. గత ప్ర­భు­త్వం చే­సిన అప్పు­ల­కు ఈ ప్ర­భు­త్వం వడ్డీ­లు కడు­తోం­ద­ని పదే­ళ్లు రా­ష్ట్రా­న్ని పా­లిం­చిన భారత రా­ష్ట్ర సమి­తి ఒక్క ప్రా­జె­క్టు­ను కూడా పూ­ర్తి చే­య­లే­ద­న్నా­రు. కనీ­సం గతం­లో కాం­గ్రె­స్ శం­కు­స్థా­పన చే­సిన ప్రా­జె­క్టు­ల­ను కూడా ఆ పా­ర్టీ పూ­ర్తి చే­య­లే­క­పో­యిం­ద­ని ఎద్దే­వా చే­శా­రు. కొ­ల్లా­పూ­ర్ ని­యో­జ­క­వ­ర్గం­లో పలు అభి­వృ­ద్ధి పను­ల­కు డి­ప్యూ­టీ సీఎం శం­కు­స్థా­పన చే­శా­రు.

‘‘కృష్ణా నదిపై భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదు. తెలంగాణకు ద్రోహం చేసింది.. భారత రాష్ట్ర సమితి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాబట్టే బనకచర్ల ప్రాజెక్టు ఆగింది" అని భట్టీ వెల్లడించారు. 

Tags:    

Similar News