TSRTC : బిగ్ షాక్.. 20 శాతానికి పైగా పెరిగిన బస్ పాస్ రేట్లు

Update: 2025-06-09 12:45 GMT

రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ బస్పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. పెంచిన బస్ పాస్ ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. 20 శాతానికి పైగా బస్పస్ రేట్లను పెంచారు. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్ ప్రెస్ పాస్ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. బస్పాస్ చార్జీలు పెరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 12 నుంచి విద్యార్థు లకు రాయితీ బస్పాసులను జారీ చేసేందుకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలో 40 ఆర్టీసీ సెంటర్లలో విద్యార్థులు బస్ పాస్ లను పొం దవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అలాగే కొత్త బస్పస్ కోసం ఆర్టీసీ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News