BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు నోటిఫికేషన్
బరిలో మహామహులు... అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు వ్యూహ్యాలు;
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ఫోకస్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై ఒకటో తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటనలో తెలిపింది. ప్రజాస్వామ్య బద్దంగా, అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకి నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందని ఎంపీ పాకా సత్యన్నారాయణ వెల్లడించారు. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణ, 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ నేతృత్వంలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. స్టేట్ కౌన్సిల్ మెంబెర్స్ ఓటర్లుగా ఉంటారని అన్నారు. జిల్లా అధ్యక్షులు, 8 మంది శాసనసభ్యులు, ఐదుగురు ఎంపీలు, ఒక శాసనమండలి సభ్యులు ఎలక్షన్ జాబితాలో ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకూ 25 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం జులై 1వ తేదీన ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. కొంతకాలంగా కొత్త అధ్యక్షులను ఎన్నుకోవాలని డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేసింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక
తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల జరగనుంది. ఈ మేరకు ఏపీ [బీజేపీ](https://telugu.abplive.com/topic/BJP) అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాజ్యసభ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన నామినేషన్లు స్వీకరించడం, ఉపసంహరణ సైతం అదే రోజు ఉంటుందన్నారు. నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జులై 1న పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో తెలంగాణలో కాషాయ దళం పగ్గాలను [బండి సంజయ్](https://telugu.abplive.com/topic/Bandi-Sanjay) నుంచి కిషన్ రెడ్డి చేతికి అప్పగించింది అధిష్టానం. 2018 ఎన్నికలతో పోల్చితే 2023లో బీజేపీ ఎక్కువ సీట్లు, ఓట్ల శాతంతో స్పష్టమైన మార్పు చూపించింది. ఏపీలో ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా సైతం ఘన విజయం సాధించారు.