BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు నోటిఫికేషన్

బరిలో మహామహులు... అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు వ్యూహ్యాలు;

Update: 2025-06-29 06:30 GMT

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు ముం­దు భా­ర­తీయ జనతా పా­ర్టీ సం­స్థా­గత ఎన్ని­కల ప్ర­క్రి­య­పై ఫో­క­స్ చే­సిం­ది. ఏపీ, తె­లం­గాణ రా­ష్ట్రా­ల­కు అధ్య­క్షుల ని­యా­మ­కా­ల­కు ము­హూ­ర్తం ఖరా­రు చే­సిం­ది. తె­లం­గాణ బీ­జే­పీ అధ్య­క్షు­డి కోసం నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­శారు. సో­మ­వా­రం నా­మి­నే­ష­న్లు స్వీ­క­రి­స్తా­రు. జులై ఒకటో తే­దీన ఎన్నిక ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు పా­ర్టీ ప్ర­క­ట­న­లో తె­లి­పిం­ది. ప్ర­జా­స్వా­మ్య బద్దం­గా, అం­త­ర్గత ప్ర­జా­స్వా­మ్యం పా­టి­స్తూ బీ­జే­పీ ప్ర­తి మూడు సం­వ­త్స­రా­ల­కి ఒక­సా­రి బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్ష ఎన్ని­క­కి నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­య­టం జరు­గు­తుం­ద­ని ఎంపీ పాకా సత్య­న్నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు. 30వ తే­దీన నా­మి­నే­ష­న్ స్వీ­క­రణ, అదే రోజు సా­యం­త్రం­లో­పు ఉప­సం­హ­రణ, 1వ తే­దీన రా­ష్ట్ర అధ్య­క్షుల ఎన్నిక జరు­గు­తుం­ద­ని తె­లి­పా­రు. కర్ణా­టక ఎంపీ పీసీ మో­హ­న్ నే­తృ­త్వం­లో ఎన్నిక జరు­గు­తుం­ద­ని చె­ప్పా­రు. స్టే­ట్ కౌ­న్సి­ల్ మెం­బె­ర్స్ ఓట­ర్లు­గా ఉం­టా­ర­ని అన్నా­రు. జి­ల్లా అధ్య­క్షు­లు, 8 మంది శా­స­న­స­భ్యు­లు, ఐదు­గు­రు ఎం­పీ­లు, ఒక శా­స­న­మం­డ­లి సభ్యు­లు ఎల­క్ష­న్ జా­బి­తా­లో ఉం­టా­ర­ని తె­లి­పా­రు. ఇప్ప­టి వరకూ 25 లక్షల మంది పా­ర్టీ సభ్య­త్వం తీ­సు­కు­న్నా­ర­ని అన్నా­రు. తె­లం­గాణ బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డి ఎన్నిక కోసం నేడు నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­య­ను­న్న­ట్లు పా­ర్టీ ఒక ప్ర­క­ట­న­లో తె­లి­పిం­ది. సో­మ­వా­రం అభ్య­ర్థుల నుం­చి నా­మి­నే­ష­న్లు స్వీ­క­రి­స్తా­రు. అనం­త­రం జులై 1వ తే­దీన ఎన్ని­కల ప్ర­క్రి­య­ను ని­ర్వ­హి­స్తా­రు. కొం­త­కా­లం­గా కొ­త్త అధ్య­క్షు­ల­ను ఎన్ను­కో­వా­ల­ని డి­మాం­డ్ ఉంది. దీం­తో ఈ ప్ర­క్రి­య­ను పూ­ర్తి చే­యా­ల­నే ఆలో­చన బీ­జే­పీ హై­క­మాం­డ్ చే­సిం­ది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక

తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల జరగనుంది. ఈ మేరకు ఏపీ [బీజేపీ](https://telugu.abplive.com/topic/BJP) అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాజ్యసభ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన నామినేషన్లు స్వీకరించడం, ఉపసంహరణ సైతం అదే రోజు ఉంటుందన్నారు. నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జులై 1న పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో తెలంగాణలో కాషాయ దళం పగ్గాలను [బండి సంజయ్](https://telugu.abplive.com/topic/Bandi-Sanjay) నుంచి కిషన్ రెడ్డి చేతికి అప్పగించింది అధిష్టానం. 2018 ఎన్నికలతో పోల్చితే 2023లో బీజేపీ ఎక్కువ సీట్లు, ఓట్ల శాతంతో స్పష్టమైన మార్పు చూపించింది. ఏపీలో ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా సైతం ఘన విజయం సాధించారు. 

Tags:    

Similar News