గ్రేటర్ హైదరాబాద్లో వరద సాయం అగిపోవడానికి బీజేపీయే కారణమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే EC వరద సాయం ఆపాలని ఆదేశించిందన్నారు. పేదల పొట్టకొట్టింది BJP నేతలేనని మండిపడ్డారు. ఇవాళ్టి మీటింగ్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే.. BJPపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.