Etela Rajendar : కేసీఆర్ చేతనైతే వడ్లు కొను లేకపోతే దిగిపో : ఈటల రాజేందర్
Etela Rajendar : ధాన్యం కొనకుంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
Etela Rajendar : ధాన్యం కొనకుంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ నీచ ఆలోచనలతో రైతులు మునిగిపోతున్నారన్న ఆయన.. పెంచిన విద్యుత్, బస్ఛార్జీల పెంపు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ నిర్వాహకుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. ఇక కాళ్ల కింద భూమి కదిలిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారని మండిపడ్డారు. కోపం ఉంటే బీజేపీపై తీర్చుకోవాలని... రైతులపై కక్ష సాధిస్తూ.. పండించిన పంట కొనకుండా వేధించడమేంటని మండిపడ్డారు.