Yadadri Bhuvanagiri : బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు .. మూడుకు చేరిన మృతుల సంఖ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీ మియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో నిన్న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.. ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ఆత్మకూరుకు చెందిన కల్వల నరేశ్ (30) నిన్న మృతిచెందగా.. ఇవాళ కాటేపల్లికి చెందిన జి.సందీప్, మోటకొండూరు చెందిన సీహెచ్ దేవీచరణ్ చనిపోయారు. ప్రీమియర్ ఎక్స్లోజివ్స్ లోని 18ఏ బ్లాక్ బిల్డింగ్లో నిన్న సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలి పోయింది. క్వారీల్లో వినియోగించే బాంబుల ముడిసరకు ను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఘటన సమయంలో బిల్డింగ్లో మొత్తం 9 మంది కా ర్మికులు పనిచేస్తున్నారు. ఇందులో యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్, పెద్దకందుకూరుకు చెందిన ఎస్. మహేందర్, వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన బి.లింగస్వామి, మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ఆర్. శ్రీకాంత్లకు తీవ్ర గాయాలు కాగా.. హైదరా బాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. మరోవైపు కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.