జూన్ 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహిస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండిశ్రీ మహాకాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవ స్థానం, కార్వాన్ సబ్జీ మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలనులు నిర్వహిస్తామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని, అందులో 9 దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మిగతా 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. జూలై 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, 20న శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం సన్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం అంబారీ ఏనుగు ఊరేగింపు ఉంటోందన్నారు.