koushikreddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌.. బెయిల్‌పై విడుదల

బెదిరింపు కేసులో కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌.. రిమాండ్ తిరస్కరించిన న్యాయస్థానం... ఊహించని సాక్ష్యాలతో నేడు ప్రెస్‌ మీట్;

Update: 2025-06-22 03:30 GMT

బీ­ఆ­ర్ఎ­స్‌ ఎమ్మె­ల్యే అరె­స్ట్‌.. వి­డు­ద­ల­తో శని­వా­రం తె­లం­గాణ రా­జ­కీ­యం మరింత వే­డె­క్కిం­ది. తొ­లుత కౌ­శి­క్‌­రె­డ్డి­ని బె­ది­రిం­పుల కే­సు­లో పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. అనం­త­రం కౌ­శి­క్‌­రె­డ్డి­కి బె­యి­ల్‌ వస్తుం­దా రాదా అన్న ఉత్కంఠ నె­ల­కొం­ది. తొ­లుత కౌ­శి­క్ రె­డ్డి­కి 14 రో­జుల రి­మాం­డ్ వి­ధిం­చా­రం­టూ వా­ర్త­లు వచ్చా­యి. అనం­త­రం కౌ­శి­క్‌­రె­డ్డి­కి షర­తు­ల­తో కూ­డిన బె­యి­ల్ మం­జూ­రు చే­సిం­ది.

బెదిరింపు కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

క్వా­రీ యజ­మా­ని­ని బె­ది­రిం­చిన కే­సు­లో పో­లీ­సు­లు హు­జూ­రా­బా­ద్ ఎమ్మె­ల్యే కౌ­శి­క్‌­రె­డ్డి­ని పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. నా­ట­కీయ పరి­ణా­మాల నడుమ శని­వా­రం ఉదయం కౌ­శి­క్‌­రె­డ్డి­ని శం­షా­బా­ద్ వి­మా­నా­శ్ర­యం­లో వరం­గ­ల్ సు­బే­దా­రీ పో­లీ­సు­లు అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.  అనం­త­రం వరం­గ­ల్‌­కు తర­లిం­చి.. తొ­లుత ఎం­జీ­ఎం ఆస్ప­త్రి­లో వై­ద్య పరీ­క్ష­లు చే­యిం­చా­రు. ఆపై కా­జీ­పేట రై­ల్వే కో­ర్టు­లో హా­జ­రు­ప­ర్చా­రు. తొ­లుత కో­ర్టు ఆయ­న­కు 14 రో­జుల రి­మాం­డ్‌ వి­ధిం­చ­డం­తో.. ఖమ్మం జై­లు­కు తర­లిం­చేం­ద­కు పో­లీ­సు­లు ప్ర­య­త్నా­లు ప్రా­రం­భిం­చా­రు. ఈలో­పు  41ఏ నో­టీ­సు­లు ఇవ్వ­కుం­డా అరె­స్టు చే­శా­ర­ని కౌ­శి­క్‌­రె­డ్డి తరఫు న్యా­య­వా­ది వా­ద­న­లు వి­ని­పిం­చ­డం­తో.. రి­మాం­డ్‌ రద్దు చే­స్తూ షర­తు­ల­తో కూ­డిన బె­యి­ల్‌ మం­జూ­రు చే­సిం­ది కో­ర్టు. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్‌ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని.. లీగల్ టీం వాధించింది. ఇరు వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

కేసు ఏంటంటే.. 

మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News