నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో త్వరలో జరగనున్న బైపోల్ను ఏకగ్రీవం చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. విపక్షాలు ఇందుకు సహకరించాలన్నారు. మిగతా చోట్ల ఎలా ఉన్నా నల్గొండ వరకూ ఈ సంప్రదాయాన్ని పాటించాలన్నారు. గతంలో రాగ్యా నాయక్ హత్య తర్వాత భారతి రాగ్యానాయక్ ఏకగ్రీవంగా గెలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దిగితే TRS కూడా దానికి తగ్గట్టే ఆలోచిస్తుంది.