బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, మంత్రి హరీశ్ రావులపై కేసు నమోదైంది. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై గురువారం హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ ఆఫీస్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఆమె స్వాగతం పలుకుతూ నూలుపోగు దండ వేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారని సాక్ష్యాలతో కొండా సురేఖ ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని రఘునందన్రావు స్పష్టం చేశారు.