HYDRA : హైడ్రా రంగనాథ్‌కు మరో సంచలన బాధ్యత అప్పగించిన సీఎం

Update: 2024-09-03 10:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమించి కట్టిన కట్టడాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమాత్రం తగ్గేది లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ప్రధాన బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం.

రేవంత్ సర్కారు హైడ్రాను మరింత స్ట్రెంతెన్ చేసింది. HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఛైర్మన్‌గా ఏవీ రంగనాథ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. HMDA లో పరిధిలో ఏడు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ ఆలోచిస్తోంది.

Tags:    

Similar News