పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం-సీఎం కేసీఆర్

తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2021-03-26 10:21 GMT

తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. భూమి సమస్యలను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో భూముల వివరాలు తెలిసేది కాదన్న సీఎం కేసీఆర్.. ధరణి పోర్టల్‌ ద్వారా ప్రతి ఎకరా భూమి వివరాలను పక్కాగా తెలుసుకోవచ్చని స్పష్టంచేశారు.

Tags:    

Similar News