KCR : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్‌ ఇండియా సర్వీస్ రూల్స్‌ సవరణపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2022-01-24 14:00 GMT

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్‌ ఇండియా సర్వీస్ రూల్స్‌ సవరణపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల హక్కులను హరిస్తాయని కేసీఆర్‌ లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య స్ఫూర్తికి ప్రతిపాదిత సవరణలు విరుద్ధం అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సవరణలు రాష్ట్రాల హక్కులను హరిస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసులలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సర్వరూపాన్నే సరవణలు మార్చేస్తాయని.. అందుకే ప్రతిపాదిత సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ లేఖలో వెల్లడించారు. చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం కేసీఆర్‌.

Tags:    

Similar News