Karimnagar Collector : సర్కారు దవాఖానలో కలెక్టర్ పమేలా ట్రీట్ మెంట్

Update: 2025-06-17 07:00 GMT

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబం ధిత సమస్యలు.. ముఖ్యంగా సైనస్, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించిన తర్వాత, ముక్కులో ఎముక పెరుగుదల ఉన్నట్లు గుర్తించి, శ్రస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆమెకు ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా జరిగాయి.

ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందడం, అది కూడా ఒక శ్రస్త చికిత్స చేయించుకోవడం నిజంగా అరుదైన, ఆదర్శనీయమైన చర్య. ఇది ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పట్ల ప్రజల్లో తరచుగా ఉండే అపనమ్మ కాన్ని దూరం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా కలెక్టర్ పమేలా సత్పతిని అభినందిస్తూ.. ఆమె చర్య ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు.

Tags:    

Similar News