కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలై పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. దానం, కడియం శ్రీహరి కోర్టులో తమ వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని వారి తరుపు న్యాయవాదులు వాదించారు. ఈ క్రమంలో పలు కోర్టుల తీర్పులను వారు చదివి వినిపించారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అయితే అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ ఇటీవలే కోర్టుకు నివేదించారు.ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతనే కోర్టులకు సమీక్షించే అధికారం ఉందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ఫిర్యాదులను స్పీకర్ పరిశీలించకముందే కోర్టుకు వచ్చారని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పిటిషన్లు దాఖలు చేశారన్నారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని.. అది తీర్పు వెలువరించిన తరువాతే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 రోజుల్లోనే కోర్టుకు వచ్చారని చెప్పారు.