TG DGP Warnings : బక్రీద్ నేపథ్యంలో డీజీపీ హెచ్చరికలు

Update: 2025-05-31 08:15 GMT

బక్రీద్ పండగ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల బక్రీద్ పండగ నేపథ్యంలో శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏడీజీ కమిషనర్ మహేష్ ఎం.భగవత్, ఐజీపీ మల్టీజోస్-1 ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రాష్ట్రంలో గోరక్షకులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.

ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు డీజీపీ. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. . హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ చెకోపోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఎవరైనా ఆవుల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News