ప్రపంచ సుందరీ పోటీలకు రూ.200 కోట్ల ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పడు ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 200 కోట్ల ఖర్చు చేశామన్న దానిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతుంటే దుష్పచారాలు చేయడానికి చేస్తున్నారని దుయ్య బట్టారు. డా. బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సుమారు రూ. 30 కోట్ల ఖర్చు అయిందని, వీటి ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని వివరించారు.
హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటకప్రమోషన్, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం అయ్యాయని, మిస్ వరల్డ్ ఈవెంట్ ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వాహణలో పర్యాటకం, హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవా ట్లను ప్రపంచానికి పరిచయం చేశామని వివరించారు. ఆ వేడుకల నిర్వహణ, ఆతిధ్యం పట్ల కంటెస్టెంట్లు, మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సైతం ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభు త్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సి పోయి విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చయింది రూ.30 కోట్లని, స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.9 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మరో 10 నుంచి 11 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని వివరించారు. ఈ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని, గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తే పలుచన చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలవి మర్శలు చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు.
'మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలని మంత్రి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ. 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ఇంత పెద్ద ఈవెంట్ను తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. సొంత పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారని, అందగత్తెల కాళ్లు కడిగారని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్ దేనని దుయ్య బట్టారు. కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చారనేది.. పచ్చి అబద్ధం అని, చౌమహల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు చేశారనేది అవాస్తమని, ఒక్కో ప్లేట్ కు అయిన ఖర్చు రూ.8,200 మాత్రమేనని స్పష్టంచేశారు.
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పట్ల అసభ్యంగా ప్రవర్తన చేశారని చేసిన ఆరోపణలను మంత్రి జూపల్లి ఖండించారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్ని అభూత కల్పనలేనని దుయ్యబట్టారు. మిస్ ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టారనేది వాస్తవమయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వచ్చిన వాళ్లు చివరిదాకా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ విన్నర్ గా గెలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆతిథ్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు నచ్చాయన్నారు. మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించడాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, ప్రజల దృష్టి మరల్చేందుకు అనవసర విషయాలను లేవనెత్తుతున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.