ELECTION: స్థానిక సంస్థల పోరుకు సర్వం సిద్ధం

ఈనెల 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్... తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... ఆతర్వాతే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్

Update: 2025-09-01 05:00 GMT

తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ప్ర­క్రియ ప్రా­రం­భ­మైం­ది. సె­ప్టెం­బ­ర్ 10 తర్వాత ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­ద­ల­య్యే అవ­కా­శం ఉం­ద­ని మం­త్రి కో­మ­టి­రె­డ్డి వెం­క­ట­రె­డ్డి తె­లి­పా­రు. మొ­ద­ట­గా మండల పరి­ష­త్ ప్రా­దే­శిక ని­యో­జ­క­వ­ర్గాల (MPTC), జి­ల్లా పరి­ష­త్ ప్రా­దే­శిక ని­యో­జ­క­వ­ర్గాల (ZPTC) ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­ర­ని మీ­డి­యా­తో చి­ట్‌­చా­ట్‌­లో వె­ల్ల­డిం­చా­రు. ఆ తర్వాత సర్పం­చ్ ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. మం­త్రి ప్ర­క­ట­న­తో ఆశా­వా­హు­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు సి­ద్ధ­మ­వు­తు­న్నా­రు. ఇక రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం (SEC) ఈ ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు సన్నా­హా­లు మొ­ద­లు­పె­ట్టిం­ది. సె­ప్టెం­బ­ర్ 10వ తేదీ నా­టి­కి MPTT, ZPTC ఓట­ర్ల, పో­లిం­గ్ కేం­ద్రాల తుది జా­బి­తా­ను ప్ర­చు­రిం­చా­ల­ని ఆదే­శి­స్తూ కలె­క్ట­ర్ల­కు ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. సె­ప్టెం­బ­ర్ 6న MPTT, ZPTC స్థా­నాల వా­రీ­గా ఓట­ర్లు, పో­లిం­గ్ కేం­ద్రాల ము­సా­యి­దా జా­బి­తా­లు ప్ర­చు­రిం­చ­ను­న్నా­రు. సె­ప్టెం­బ­ర్ 6-8 మధ్య ఈ ము­సా­యి­దా జా­బి­తా­ల­పై ప్ర­జల నుం­చి అభ్యం­త­రా­లు, వి­న­తు­లు స్వీ­క­రిం­చ­ను­న్నా­రు. సె­ప్టెం­బ­ర్ 8న జి­ల్లా స్థా­యి­లో కలె­క్ట­ర్లు, మండల స్థా­యి­లో MPDO­లు రా­జ­కీయ పా­ర్టీల ప్ర­తి­ని­ధు­ల­తో సమా­వే­శం ని­ర్వ­హి­స్తా­రు. సె­ప్టెం­బ­ర్ 9న అభ్యం­త­రా­లు, వి­న­తు­లు పరి­ష్క­రి­స్తా­రు. సె­ప్టెం­బ­ర్ 10న ఓట­ర్ల, పో­లిం­గ్ కేం­ద్రాల తుది జా­బి­తా­లు ము­ద్రి­స్తా­రు.

తె­లం­గా­ణ­లో రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో­ని ప్ర­భు­త్వం స్థా­నిక సం­స్థల ఎన్ని­కల వి­ష­యం­లో కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ప్ర­స్తుత షె­డ్యూ­ల్ ప్ర­కా­రం,ప్ర­భు­త్వం స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు సకా­లం­లో ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు లో­క­ల్‌ బాడీ ఎల­క్ష­న్స్‌­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇస్తూ కే­బి­నె­ట్ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. సె­ప్టెం­బ­ర్‌­లో ఎన్ని­క­లు జర­గా­ల­న్న లే­ఖ­ను ఎన్ని­కల కమి­ష­న్‌­కు తె­లం­గాణ ప్ర­భు­త్వం లేఖ రా­సిం­ది. అదే­వి­ధం­గా, రి­జ­ర్వే­ష­న్ల­లో ఉన్న సీ­లిం­గ్ క్యా­ప్‌­ను తొ­ల­గిం­చ­డా­ని­కి కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. ప్ర­త్యేక జీవో ద్వా­రా ఈ ఎన్ని­క­ల­కు వె­ళ్ళా­ల­ని, అలా­గే రి­జ­ర్వే­ష­న్ల పరి­మి­తి­ని తొ­ల­గి­స్తూ అసెం­బ్లీ­లో తగిన తీ­ర్మా­నా­న్ని తీ­సు­కో­వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ బి­ల్లు­ను త్వ­ర­లో అసెం­బ్లీ­లో ప్ర­వే­శ­పె­ట్టే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. జూన్ 25న తె­లం­గాణ హై­కో­ర్టు ఇచ్చిన ఆదే­శాల ప్ర­కా­రం సె­ప్టెం­బ­ర్ 30 నా­టి­కి స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ప్ర­క్రి­య­ను పూ­ర్తి చే­యా­ల్సి ఉంది. ఈ నే­ప­థ్యం­లో, వె­ను­క­బ­డిన తర­గ­తు­ల­కు (ఓబీ­సీ) 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­య­డం­పై అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ­లో తీ­వ్ర కస­ర­త్తు జరు­గు­తోం­ది. ఇం­దు­కో­సం రి­జ­ర్వే­ష­న్ల పరి­మి­తి­ని ఎత్తి­వే­స్తూ తీ­సు­కొ­చ్చిన జీ­వో­ను అసెం­బ్లీ ముం­దు­కు కూడా తీ­సు­కొ­చ్చిం­ది. దీం­తో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు కా­ను­న్నా­యి.

Tags:    

Similar News