మంత్రులకే దొరకని సీఎం కేసీఆర్, ఎంపీటీసీ సర్పంచ్లతో మాట్లాడుతున్నాడు : ఈటెల
మంత్రులకే దొరకని సీఎం కేసీఆర్, ఎంపీటీసీ సర్పంచ్లతో మాట్లాడుతున్నాడని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.
మంత్రులకే దొరకని సీఎం కేసీఆర్, ఎంపీటీసీ సర్పంచ్లతో మాట్లాడుతున్నాడని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఆయన వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో పర్యటించారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను ఒడగట్టాడానికి నియెజక వర్గానికి వస్తున్నారన్నారు. నేను అందరికి సహయం చేసేవాడిని.. నాకు కష్టకాలం వచ్చిందన్నారు ఈటెల. నాకు మనిషిలో ఓటు కనపడలేదని.. ఓటు మాత్రమే కనిపించదన్నారు. సీఎం కేసీఆర్ కి మాత్రం మనిషి కనిపించడని .. ఓటు మాత్రమే కనిపిస్తుందని ఈటెల స్పష్టం చేశారు.