టీఆర్‌ఎస్‌ చిల్లర వేషాలను ప్రజలు సహించరు : ఈటల

టీఆర్‌ఎస్‌ చిల్లర వేషాలను ప్రజలు సహించరన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది.

Update: 2021-07-21 09:00 GMT

టీఆర్‌ఎస్‌ చిల్లర వేషాలను ప్రజలు సహించరన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది. కమలాపూర్‌ మండలం వంగపల్లిలో బస చేస్తే రాత్రి కరెంట్‌ తీశారని ఫైరయ్యారు. తాము ఎక్కడ పర్యటిస్తే అక్కడ కరెంటు తీసేస్తున్నారని మండిపడ్డారు. ఎంత నీచంగా, నికృష్టంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రజలు గమనించాలన్నారు. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల అహంకారాన్ని ఓడగొట్టే శక్తి హుజురాబాద్‌ ప్రజలకు మాత్రమే ఉందన్నారు ఈటల.

ఇన్నేళ్లలో తాను తెలిసి ఏనాడూ తప్పు చేయలేదన్నారు ఈటల. ఒక్క కరోనా సమయంలో తప్ప ఏనాడూ నియోజకవర్గ ప్రజలకు దూరంగా లేనన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించానన్నారు. ధర్మం పాతర వేయవద్దనే వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్నానన్నారు ఈటల. 

Tags:    

Similar News