Ethanal Factory : ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు .. దిలావర్పూర్ లో హైటెన్షన్

Update: 2024-11-27 13:45 GMT

నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు నేషపల్ హైవేపై అర్ధరాత్రి వరకు రాస్తారోకో చే పట్టారు. ఘటన స్థలానికి నిర్మల్ ఆర్డీవో రత్న కల్యాణి ఆందోళన కారుల వద్దకు రాగానే ఆమె కారును అడ్డుకున్నారు. కలెక్టర్స్వయంగా వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించ బోమని పట్టుబట్టారు. అక్కడి నుంచి ఆర్డీవో వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. అమెకారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు ఆర్డీవో ను ఆందోళనకారుల నుంచి సేఫ్ గా అక్కడి నుంచి తరలించారు. ఇవాళ దిలావర్పూర్ లో పోలీసులు పహారా కొనసాగించారు. ఆర్డీవోపై దాడిని ఖండిస్తున్నం రెండో రోజు రాస్తారోకో చేయకుండా గ్రామ స్థులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో స్థానికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికు లు డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాలతో ఒక్కసారిగా రైతులు రోడ్డుపై వచ్చి ఆందోళనకు దిగారు. పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రి క్తత వాతావరణం నెలకొంది. దిలావరప్పూర్ వద్ద నేషనల్ హైవేపై నాలుగు గ్రామాల రైతులు భారీగా తరలివచ్చి, రోడ్డుపై భైఠాయించి డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి హైదరాబాద్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఆర్డీవో రత్నకల్యాణిపై ఆందోళనకారులు వ్యవ హరించిన తీరు బాధాకరమని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. 'ఆర్డీవో కారుపై దాడి చేసి, నిర్భందించడాన్ని ఖండిస్తున్నం. నిన్న లగచర్ల.. నేడు దిలావర్్పూర్లో రెవెన్యూ అధికారులపై ఆందోళన కారులు వ్యవ హరిస్తున్న తీరు సరైంది కాదు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు రిఫిట్ కాకుండా చూడాలి' అని లచ్చిరెడ్డి అన్నారు. దిలావర్పర్ రైతులకు మద్దతుగా సమీప గ్రామాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. నిర్మల్ ఎస్పీ రాస్తారోకో వద్ద పరిస్థితి సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News