TG : కలెక్టర్ వచ్చినా తరిమి కొడదాం...బయటికొచ్చిన నరేందర్ రెడ్డి కాల్ డేటా

Update: 2024-11-14 10:15 GMT

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిపై దాడికి రెండు రోజుల ముందు లగచర్లలో జరిగిన నిర్వాసితుల సమావే శంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోం ది. సీఎం వచ్చినా... కలెక్టర్ వచ్చినా తరిమి కొడదా మంటూ ఆయన పిలుపునిచ్చారు. పట్నం నరేందర్ రెడ్డి ఏమన్నారంటే..‘రైతుల భూములు గుంజుకొని ఫార్మా వేస్తా అంటే ఊకుంటమా.. అప్పుతెచ్చి రెండే కరాలు మూడెకరాలు కొనుక్కొన్న భూములు గుం జుకుంటరా? ముఖ్యమంత్రికి సోయిలేదా..? ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రిగా గెలిచినవ్ కదా. నీకు ఇంతనన్న సోయిలేదా? ఆఫీసర్లు వచ్చినా.. లీడర్లు వచ్చినా పెద్ద ఎత్తున.. మొన్న జరిగింది చిన్నదే.. పెద్ద ఎత్తున తరి మికొడదాం. గ్రామాల్లో ఎక్కడికి వచ్చినా వదలం.. ముఖ్యమంత్రి రానీ, కాంగ్రెస్ నాయకులను రానీ.. కలెక్టర్ రానీ తరిమికొడం.. నేను అండగా ఉంట.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది.. కేటీఆర్ గారు అండగా ఉంటారు.. హరీశ్ రావు గారు అండగా ఉంటారు.. కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు.. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పిన... ఇదంతా చెప్తే.. ఈ సారి అవసరం అనుకుంటే మనమే పోదామని చెప్పారు.. మీరు ఎక్కడా భయ పడకుండ్రి, ధైర్యంగా ఉండండి.. మళ్లోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం.. కాంగ్రెస్ లీడర్లు వచ్చినా తరిమి తరమి కొడదాం.. పార్మా రద్దు చేసే వరకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నా'. అంటూ ఆ వీడియోలో పట్నం పేర్కొన్నారు.

లగచర్ల దాడి కేసులో నిం దితుడిగా ఉన్న బోగమోని సురేశ్ కాల్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాల్ డేటా బయటికి వచ్చింది. సురేశ్ తో ఏకంగా 84 సార్లు పట్నం సంభా షించినట్టు తేలింది. ఇందిలా ఉండగా నిన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని చెక్ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. ఈ కేసును ఏడీజీ మహేశ్ భగవత్, ఐజీ సత్యనారాయణ విచారిస్తున్నారు.

Tags:    

Similar News