తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో వడ్లకు నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోని దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డు ఎక్కారు. 20 రోజుల నుంచి ఐకేపీలో ఎలాంటి కాంటాలు జరగక లారీలు రాక గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో వడ్లను తగలబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల బతుకులు ఆగమైతున్నాయని నిరసన తెలిపారు.