TRS Plenary 2022: టీఆర్‌ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై జరిమానాల మోత.. ఏకంగా రూ.7 లక్షల 70 వేల..

TRS Plenary 2022: టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై జరిమానాల మోత మోగింది.

Update: 2022-04-28 04:15 GMT

TRS Plenary 2022: టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీలపై జరిమానాల మోత మోగింది. ట్విటర్ వేదికగా వచ్చిన ఫిర్యాదులపై ఈవీడీఎం జరిమానా వేసింది. మంత్రి తలసానికి లక్షరూపాయలు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీకి రూ 90 వేలు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ15 వేలు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.15 వేలు, ఇతరులకు 5 లక్షల 50 వేల రూపాయల ఫైన్ వేసింది. ఇప్పటి వరకు 7 లక్షల 70 వేల రూపాయల ఫైన్ వేసినట్లు తెలిపారు కేవలం ట్విట్టర్లో వచ్చిన వాటికి మాత్రమే ఫైన్లు వేసి చేతులు దులుపుకున్నారు GHMC ఈవీడీఎం.

Tags:    

Similar News