ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉదృతి ఎక్కువ ఇవ్వడంతో అప్రవత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699.350 అడుగుల వద్ద కొనసాగుతోంది.ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 25403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా 21749 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు.
దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్లకూడదని సూచిస్తున్నారు.