మాజీ సీఎం కేసీఆర్ ను కా ళేశ్వరం కమిషన్ ఈ నెల 11న విచారించనుంది. మొదట ఈ నెల 5న విచారించాలని భావించి సమన్లు జారీ చేసింది. అయితే తన విచారణను ఈ నెల 11 వాయిదా వేయాలని కోరుతూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. హరీశ్ రావు విచారణ తేదీలోనూ మార్పలు చోటు చేసుకున్నాయి.ఆయనను కమిషన్ ఈ నెల 9న విచారించనుంది. ఈ నెల 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలంటూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్వల్ప మార్పుల తర్వాత అందరి కన్నాముందుగా కమిషన్ ఈటల ను విచారించ నుంది. ఆయన ఈ నెల 6న జరిగే విచారణకు హాజరవుతా రు. 9వ తేదీన మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విచారణకు వెళ్తారు. ఈ నెల 11న కేసీఆర్ విచారణకు హాజ రవుతారు. కాళేశ్వరం కమిషన్ నుంచి సమన్లు రావడంతో కేసీఆర్ విచారణలో చెప్పాల్సిన సమాధానాలపై అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఈ క్రమం లోనే మూడు సార్లు హరీశ్ రావుతో భేటీ అయ్యారు. ఎర్ర వల్లి ఫాంహౌస్ లో వీరిద్ద రూ విచారణపై చర్చించారు.