ఉమ్మడి ఆదిలాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ సోయం బాపూ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హస్తం గూటిలో చేరారు. వీరికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్రం సక్కు 2009, 2019లో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ రెండు పర్యాయాలు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితున్ని అయ్య. అన్ని మతాలకు నేను గౌరవిస్తా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కు కట్టుబడి పని చేస్తాని సోయం బాపు రావు అని తెలిపారు. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. మా మీద విమర్శలు చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. మంచి ముహూర్తం చూసుకొని వారు కూడా మా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని పీసీసీ చీఫ్ తెలిపారు