Singareni : సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి ఎస్ఆర్పీ 3 గనిలో ప్రమాదం జరిగింది.. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతిచెందినట్లుగా తెలుస్తోంది.;
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి ఎస్ఆర్పీ 3 గనిలో ప్రమాదం జరిగింది.. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతిచెందినట్లుగా తెలుస్తోంది.. మొదటి షిఫ్ట్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.. ఆ సమయంలో నలుగురు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.. 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు.. కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మృతిచెందినట్లుగా తెలుస్తోంది.. వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.