TG : గాంధీ హైస్కూల్ మరమ్మతులకు నిధులు మంజూరు

Update: 2024-10-29 09:30 GMT

పట్టణంలోని జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏసీడీపీ నుంచి నిధులను మంజూరు చేశారు. అసంపూర్తిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులకు రూ,14 లక్షల 75 వేలలను మంజూరు చేశారు. ఈ నిధులతో పాఠశాలలోని బ్యాలెన్స్ వర్క్, పెయింటింగ్, టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్ మొదలగు పనులకు నిధులు మంజూరు చేస్తూ.. మంత్రి విడుదల చేశారు. పాఠశాల అభివృద్ది కమిటీ చైర్ పర్సన్ సంధ్యారాణి సోమవారం జిహెచ్ఎం శోభారాణి కి ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో నిధులు అందజేశారు.Sandhyarani is the  of the Development Committee

Tags:    

Similar News