GANDHI: తెలంగాణ వైద్య రంగంలో మరో కీలక అడుగు

గాం­ధీ ఆస్ప­త్రి­లో ఉచిత కా­క్లి­య­ర్ ఇం­ప్లాం­ట్ శస్త్ర­చి­కి­త్స­

Update: 2025-11-25 06:30 GMT

తె­లం­గాణ వై­ద్య రం­గం­లో మరో కీలక అడు­గు వే­స్తూ, గాం­ధీ ఆస్ప­త్రి­లో ఉచిత కా­క్లి­య­ర్ ఇం­ప్లాం­ట్ శస్త్ర­చి­కి­త్స­ల­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం శ్రీ­కా­రం చు­ట్టిం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి, ఆరో­గ్య­శాఖ మం­త్రి దా­మో­ద­ర్ రా­జ­న­ర్సింహ మా­ర్గ­ద­ర్శ­క­త్వం­లో ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల్లో కా­ర్పొ­రే­ట్ స్థా­యి వై­ద్య సే­వ­లు అం­దు­బా­టు­లో­కి రా­వ­డం ఆరో­గ్య రం­గం­లో కొ­త్త దశను ప్రా­రం­భిం­చి­న­ట్లు­గా వై­ద్యు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. సా­ధా­ర­ణం­గా రూ.10 లక్షల వరకు ఖర్చ­య్యే కా­క్లి­య­ర్ ఇం­ప్లాం­ట్ శస్త్ర­చి­కి­త్స­ను గాం­ధీ ఆసు­ప­త్రి­లో పూ­ర్తి­గా ఉచి­తం­గా అం­దిం­చేం­దు­కు ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది. పు­ట్టు­క­తో­నే వి­ని­కి­డి లోపం ఉన్న చి­న్నా­రు­ల­ను ఆరో­గ్య­శ్రీ పథకం ద్వా­రా గు­ర్తిం­చి, ఈ సే­వ­లు అం­ది­స్తు­న్నా­రు. ఇయర్-నోస్-థ్రో­ట్ (ENT) వి­భా­గం ఆధ్వ­ర్యం­లో ఐదే­ళ్ల లోపు పి­ల్ల­ల­కు ఈ శస్త్ర­చి­కి­త్స­లు అం­దిం­చేం­దు­కు ప్ర­త్యేక ఏర్పా­ట్లు చే­శా­రు. కా­ర్య­క్ర­మం ప్రా­రం­భ­మైన తొలి రో­జు­నే గాం­ధీ ఆసు­ప­త్రి ఈఎ­న్టీ వి­భా­గం వై­ద్యు­లు ఒక బా­లు­డి­కి వి­జ­య­వం­తం­గా కా­క్లి­య­ర్ ఇం­ప్లాం­ట్ శస్త్ర­చి­కి­త్స ని­ర్వ­హిం­చా­రు. కా­క్లి­య­ర్ ఇం­ప్లాం­ట్ సా­యం­తో పి­ల్ల­లు వి­ని­కి­డి సా­మ­ర్థ్యం­తో పాటు మా­ట్లా­డే నై­పు­ణ్యా­న్ని కూడా అభి­వృ­ద్ధి చే­సు­కో­వ­చ్చ­ని వై­ద్య ని­పు­ణు­లు తె­లి­పా­రు. ప్ర­భు­త్వ ఉచిత వై­ద్య సే­వ­లు సా­మా­న్య ప్ర­జ­ల­కు పలు­కు­బ­డి కలి­గే­లా ఈ కా­ర్య­క్ర­మం దో­హ­ద­ప­డు­తుం­ద­నే అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. ఈ మే­ర­కు ఈ వి­వ­రా­ల­ను సో­మ­వా­రం ఎక్స్ వే­ది­క­గా వై­ద్య శాఖ మం­త్రి దా­మో­ద­ర్ రా­జ­నా­ర్సింహ వె­ల్ల­డిం­చా­రు.

అరుదైన శస్త్రచికిత్స

గాంధీ ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు. మంచిర్యాల జిల్లా అకినేపల్లికి చెందిన అఖిల్‌ (7)కు మూడు నెలల వయసులోనే హెరిడిటరీ స్ఫెరోసైటోసిస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రొఫెసర్‌ నాగార్జున నేతృత్వంలో నిపుణులైన వైద్యులు అత్యంత క్లిష్టమైన ల్యాప్రొస్కోపిక్‌ స్ల్పినెక్టమీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి వ్యాధుల్లో రక్తస్రావం అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ఓపెన్‌ సర్జరీ చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్‌ నాగార్జున తెలిపారు. ల్యాప్రొస్కోపిక్‌ స్ల్పినెక్టమీ సర్జరీతో నొప్పి, ఇన్ఫెక్షన్లు, మచ్చలు తక్కువగా ఉంటాయని, రోగి త్వరగా కోలుకుంటారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి అని ప్రొఫెసర్‌ వాణి తెలిపారు. గాంధీఆస్పత్రి చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు.

Tags:    

Similar News