గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్లతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బస్తీ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా గత రాత్రి నాగోల్లోని జైపూరి కాలనీలో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ రాజ్కుమార్ అనే సామాన్యుడి ఇంట్లో భోజనం చేసి... స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ రాత్రి అక్కడే నిద్రించారు బండి సంజయ్. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.