గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది.