గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ల శంఖారావం

Update: 2020-11-08 08:50 GMT

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ల శంఖారావం పూరించారు. ఎల్బీనగర్‌లో టీడీపీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ TDP కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే GHMC ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌. హైదరాబాద్‌లో టీడీపీ హయంలో జరిగిందే అభివృద్ధేని.. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ చేసేందేమి లేదన్నారు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌. GHMC ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతామన్నారు.


Tags:    

Similar News