డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మరో 30 వేల కొలువులు త్వరలో భర్తీ చేయనున్నామని స్పష్టంచేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామన్నారు. స్కిల్ యూని వర్సిటీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోలో ఒకటి ఉండేలా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల కోసమే రూ.95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతుల అకౌంట్ లో జమ చేశాం. రూ. 260 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. రాష్ట్రంలో రూ.22వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నం. దీంతో 94 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. రూ.6 వేల కోట్ల విలువైన 188 కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చాం. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అంద జేస్తున్నం. 93.7 లక్షల కుటుంబాల కు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నం. రాహుల్ సూచనతో కులగణన చేపట్టి దేశానికి రోల్ మోడల్ గా నిలిచాం. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నం. ఇటు పార్టీ .. అటు అభి వృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకు పోతున్నాం. పదేండ్లు పాలన చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు బీసీ బిల్లు గురించి మాట్లాడడం.. దయ్యాలు వేదాలు వల్లించడమే' అని అన్నారు.